బిఆర్ఎస్ కార్యకర్తల కేనా  సంక్షేమ పథకాలు

బిఆర్ఎస్ కార్యకర్తల కేనా  సంక్షేమ పథకాలు
  • అర్హులైన పేదలకు ఇవ్వరా
  • అధికార పార్టీ నాయకులు తప్పుడు ఆలోచనలు మానుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు
  •  పాలకులను ప్రశ్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మట్టి పెళ్లి సైదులు


ముద్ర మోతే:-తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, పింఛన్లు, మైనార్టీ బందు, గృహలక్ష్మి,డబల్ బెడ్ రూమ్ పథకాలను బిఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని అధికారం పార్టీ నేతలు తప్పుడు ఆలోచనను మానుకోవాలని లేనియెడల ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు  హెచ్చరించారు. శనివారంసిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్,ఎంపీడీవో కార్యాలయాల ముందు అర్హులైన పేదలందరికీ దళిత బంధు, బీసీ రుణాలు, గృహలక్ష్మిఇండ్లు,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు,ఇవ్వాలనిఅధికార పార్టీ కార్యకర్తలకే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ  ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ  పథకాలు మొత్తం బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకునే విధానాన్ని మార్చుకొని  అర్హులైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వస్తే గ్రామంలోని అన్ని పార్టీల పెద్దలందరూ కూర్చొని అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసే వారిని, కానీ నేడుబిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

బిఆర్ఎస్ పార్టీ లో ఆర్ధికంగా స్థిరపడినవారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.నీజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అనడం అర్థం లేదన్నారు. అందుకే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై దళితులు, బీసీలు, మైనార్టీలు, పేదలు, అందరిని కలుపుకొని  ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను దొడ్డి దారిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే హక్కు ఎవరు కల్పించాలని ప్రశ్నించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ సోమపంగు సూరయ్య కు సమర్పించారు.ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ,  కంపాటి శ్రీను, కిన్నెర పోతయ్య, నాగం మల్లయ్య, బానోతుల లచ్చిరాం, చర్లపల్లి మల్లయ్య, బూడిద లింగయ్య,కొండ భాస్కర్,నాయకులు ములుకూరి మణెమ్మ, తురక నాగమ్మ, చర్లపల్లి యాదమ్మ, రాంజీ, బానోతు వెంకన్న, బాలాజీ నాయక్, చంటి, బానోతు వెంకన్న, గుగులోతు రామ తదితరులు పాల్గొన్నారు.